ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandra Babu | ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు .. సీఎం చంద్రబాబు...

    CM Chandra Babu | ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు .. సీఎం చంద్రబాబు కీల‌క ప్ర‌క‌ట‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్‌ రంగంలో దేశానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నం(Visakhapatnam)లోని నోవాటెల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు.

    ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandra Babu) మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీని ద్వారా ఏపీని మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.

    CM Chandra Babu | ఏపీకి ఉన్న ప్రత్యేక అనుకూలతలు

    చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరరేఖ, మంచి రైల్వే కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న రహదారి మౌలిక వసతులు లాంటి అంశాలు పారిశ్రామికీకరణకు దోహదంగా మారతాయని పేర్కొన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్‌ సాంకేతిక రంగాల్లో ఏపీ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ప్రస్తావించిన సీఎం, “రాబోయే రోజుల్లో రోడ్లు, రైళ్లు, సముద్ర రవాణా గణనీయంగా పెరుగుతుంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా పెద్దపీట వేస్తాం” అని చెప్పారు. అమరావతి(Amaravathi)ని క్వాంటం కంప్యూటింగ్‌కు తలమానికంగా అభివృద్ధి చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.

    ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న లాజిస్టిక్స్ కంపెనీల ప్రతినిధులు ఎయిర్ కార్గో వసతులు పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందనగా సీఎం చంద్రబాబు ఎయిర్ కార్గో ఫోరం ఇండియా(Air Cargo Forum India) యొక్క కొత్త లోగోను ఆవిష్కరించారు.అంతకుముందు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. అమరావతి అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. ఈ నిర్ణయాలతో ఏపీ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగనుందని పరిశ్రమల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

    More like this

    September 5 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 5 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 5,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...