అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | నగరంలోని పోలీస్పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహానికి మంగళవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రత్యేక పూజలు చేశారు. గ్రౌండ్లో శ్రీ ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నప్రసాదంలో భాగంగా భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో స్నేహా సొసైటీ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దినేష్, అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, డీఎంహెచ్వో రాజశ్రీ, ఫిషరీస్ ఏడీ ఆంజనేయులు, నిజామాబాద్ టౌన్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ (Traffic police) ఏసీపీ మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.