ePaper
More
    Homeఅంతర్జాతీయంLondon | లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి

    London | లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | లండన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు (Hyderabad) చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

    తెలుగు రాష్ట్రాలకు (Telugu states) చెందిన పలువురు యువకులు లండన్​లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. సోమవారం నిమజ్జనం కోసం రెండు కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా వారి కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నాదర్​గుల్​కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్‌కు (Uppal) చెందిన రిషితేజ(21)గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

    London | ఉన్నత చదువుల కోసం..

    నాదర్​గుల్​కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య బీటెక్​ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్​ (London) వెళ్లాడు. తమ కొడుకు విదేశాల్లో చదువుకొని తిరిగి వస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి కుమారుడిని బలి తీసుకుంది.

    More like this

    Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

    Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు...

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప...

    MLC Kavitha future | పొమ్మన్న పుట్టినిల్లు.. వద్దన్న మెట్టినిల్లు.. ఢోలాయమానంలో ఎమ్మెల్సీ కవిత భవిత!

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha future : ఇందూరు కోడలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది....