అక్షరటుడే, వెబ్డెస్క్ : London | లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు (Hyderabad) చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాలకు (Telugu states) చెందిన పలువురు యువకులు లండన్లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. సోమవారం నిమజ్జనం కోసం రెండు కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా వారి కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్కు (Uppal) చెందిన రిషితేజ(21)గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
London | ఉన్నత చదువుల కోసం..
నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్ (London) వెళ్లాడు. తమ కొడుకు విదేశాల్లో చదువుకొని తిరిగి వస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి కుమారుడిని బలి తీసుకుంది.