అక్షరటుడే, వెబ్డెస్క్ : Wanaparthi | ఓ వ్యక్తి టిఫిన్ చేశాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన చనిపోయాడు అనుకున్నారు.
వనపర్తి(Wanaparthi) పట్టణంలో పీర్లుగుట్టలో ఆదివారం వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడు అనుకున్న వ్యక్తి బతికాడు. పట్టణానికి చెందిన తైలం రమేశ్ (49) బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి(Former Minister Niranjan Reddy) వీరాభిమాని. తన ఛాతిపై అభిమాన నాయకుడు నిరంజన్రెడ్డి చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
Wanaparthi | కదలిక లేకపోవడంతో..
రమేశ్ పట్టణంలోని పీర్లుగుట్ట(Peerlugutta)లో గల తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం టిఫిన్ చేశాక ఆయన అస్వస్థతకు గురయ్యాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు రమేశ్ చనిపోయాడు అనుకున్నారు. ఈ మేరకు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. తన అభిమాని చనిపోయాడనే విషయం తెలుసుకున్న నిరంజన్రెడ్డి ఆయన మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు.
Wanaparthi | పచ్చబొట్టును చూడగా..
రమేశ్ తన ఛాతిపై గతంలో నిరంజన్రెడ్డి పచ్చబొట్టు వేయించుకున్నారు. ఆయన రమేశ్ ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళి అర్పించారు. ఈ క్రమంలో ఛాతిపై గల తన పచ్చబొట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో పచ్చబొట్టును పరిశీలిస్తుండగా.. రమేశ్ ఊపిరి తీల్చుకుంటున్నట్లు ఆయన గమనించారు. వెంటనే పూలదండలు తీసేసి నిరంజన్రెడ్డి రమేశ్ను గట్టిగా పిలిచారు. దీంతో ఆయన కనురెప్పలు కదలిల్చారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. రమేశ్ కళ్లు తెరిచాడు. దీంతో అతని కుటుంబం, బంధువులు ఇద్దరూ ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.