ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావొద్దు: కలెక్టర్​

    Prajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావొద్దు: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు.

    కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) ఆయన సోమవారం ప్రజావాణిలో భాగంగా మాట్లాడారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లాస్థాయి అధికారులు హాజరుకాకపోతే సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం అవుతుందన్నారు.

    అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని కిందిస్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. సోమవారం మొత్తం 74 వినతులు అందాయి. పలుశాఖ అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    More like this

    Bodhan | వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

    అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​ (Additional...

    Ganesh Laddu | రూ.51 లక్షలు పలికిన గణపతి లడ్డూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganesh Laddu | వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi celebrations) ఘనంగా సాగుతున్నాయి. పలు...

    IPL Tickets | జీఎస్టీలో భారీ సంస్కరణలు.. ఐపీఎల్ టికెట్లపై పన్ను పెంపు.. మ్యాచ్‌ల ఎట్ల చూడాలి!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Tickets | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో (GST system) సంచలనాత్మక మార్పులు...