అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | శాంతి భద్రతల దృష్ట్యా సోమవారం నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లాలో 30, 30ఏ పోలీస్ యాక్ట్ (30A Police Act) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు (Public meetings), సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పైచర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.