అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (heavy rains) చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నుంచి ప్రధాన పట్టణాలను కలిపే పలు మార్గాల్లో రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి–బాన్సువాడ మార్గంలో (Yellareddy-Banswada route) సైతం రాకపోకలు నిలిచిపోయాయి.
రోడ్డు ధ్వంసం కావడంతో ఆర్టీసీ బస్సులు నడవలేదు. దీంతో అధికారులు గత రెండు రోజులుగా రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎల్లారెడ్డి – బాన్సువాడ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు (RTC bus services) పున:ప్రారంభం అయ్యాయి. ఎల్లారెడ్డి–బాన్సువాడ రోడ్డును బాన్సువాడ డిపో మేనేజర్ పరిశీలించారు.
Yellareddy | ఆ మార్గాల్లో తిప్పలు
ఎల్లారెడ్డి -కామారెడ్డి (Yellareddy-Kamareddy), ఎల్లారెడ్డి- మెదక్ (Yellareddy-Medak) మధ్య సైతం రోడ్డు వర్షాలకు తెగిపోయింది. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోచారం ప్రాజెక్ట్కు భారీగా వరద వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్ట్ దిగువన మెదక్ జిల్లా పోచమ్మరాల్, కామారెడ్డి జిల్లా పోచారం గ్రామాల మధ్య గల వంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయింది. మధ్యలో బ్రిడ్జి మాత్రమే ఉంది. ఎల్లారెడ్డి మీదుగా మెదక్, హైదరాబాద్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లకు కూడా మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.
ఎల్లారెడ్డి మెదక్ రోడ్డుపై కొట్టుకుపోయిన పోచారం వంతెన
ధ్వంసమైన ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డు