ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPocharam Project | పోచారం ప్రాజెక్టు‌ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్​

    Pocharam Project | పోచారం ప్రాజెక్టు‌ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్​

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్టును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ (Mla Madan Mohan) శుక్రవారం సందర్శించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని 103 ఏళ్ల ఈ ప్రాజెక్టు ఇటీవల 1.83 లక్షల క్యూసెక్కుల వరదనీటిని సైతం ఎదుర్కొని నిలబడింది.

    అయితే ప్రాజెక్టు వద్ద మట్టికొట్టుకుపోయింది. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.  ఆ ప్రాంతంలో ఇసుక సంచులను వేసి గుంతను పూడ్చివేస్తున్నారు.

    ప్రాజెక్టు వద్ద సుమారు 800 ఇసుక సంచులను వేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గించారు. రెండురోజుల నుంచి ప్రాజెక్టు వద్ద భారీ గుంతను పూడ్చేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ(Yellareddy Constituency) ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వరద నష్టం వివరాలను, నష్టపరిహారం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఈ, డీఈఈ, ఆర్డీవో, డీఎస్పీ, ఎస్డీఆర్​ఎఫ్​ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....