ePaper
More
    HomeతెలంగాణGanesh idol Controversy | హైదరాబాద్‌లో వివాదాస్పదంగా మారిన రేవంత్ రెడ్డి గణేశ్ విగ్రహం.. రాజాసింగ్...

    Ganesh idol Controversy | హైదరాబాద్‌లో వివాదాస్పదంగా మారిన రేవంత్ రెడ్డి గణేశ్ విగ్రహం.. రాజాసింగ్ ఫిర్యాదుతో తొల‌గింపు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ganesh idol Controversy | హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రి వేడుకలు (Ganesh Navratri celebrations) ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హబీబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణేశ్ విగ్రహం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విగ్రహాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మత్స్యశాఖ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేయగా, విభిన్నంగా తయారు చేసిన ఈ విగ్రహంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖాన్ని వినాయకుడి శిరస్సుగా ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Ganesh idol Controversy | రేవంత్ గణపతిగా..?

    షర్ట్, ప్యాంట్, షూ ధరించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వేషధారణలో ఉన్న విగ్రహానికి వినాయకుడి తలను జోడించి, “తెలంగాణ రైజింగ్” అనే బ్యానర్లతో విగ్రహ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న వినాయక విగ్రహం నవరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినా.. ఇది మతభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA T.Rajasingh), హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు (Hyderabad Police Commissioner) ఫిర్యాదు చేశారు. “రేవంత్ రెడ్డి ఎవరికైనా అభిమానంగా ఉండొచ్చు. కానీ ఆయన మాకు దేవుడు కాదు. గణపతి రూపంలో ఆయన్ను చూపించడం హిందువుల మనోభావాలను గాయపరుస్తుంది. దీనిని తక్షణమే తొలగించాలి,” అని డిమాండ్ చేశారు.

    మా అభ్యర్థన ప్రకారం.. మత సామరస్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, విగ్రహానికి జరిపే పూజలు నిలిపివేయాలని, పోలీసులు వెంటనే స్పందించాలని కోరారు రాజా సింగ్ (Raja Singh). దీనిపై మెట్టు సాయికుమార్ వివరణ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి గణేశుని ఆశీస్సులు ఉండాలని ఈ వినూత్న విగ్రహం ఏర్పాటు చేశాం. గతంలో కూడా సినిమాల హీరోల రూపాల్లో విగ్రహాలు పెట్టాం.

    ఈసారి సీఎం రూపంలో పెట్టినంత మాత్రాన తప్పు కాదు,” అని అన్నారు. అలాగే, ఈ విగ్రహానికి భక్తులు విశేషంగా స్పందిస్తున్నారని, కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇది తమ అభిమానం, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విగ్ర‌హం వివాదాస్ప‌దం అవుతున్న నేప‌థ్యంలో సౌత్ వెస్ట్ డీసీపీ మండ‌పాన్ని సంద‌ర్శించి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రించొద్దంటూ హెచ్చ‌రించారు. దీంతో పోలీస‌లు ఆదేశాల మేర‌కు సాయి కుమార్ ఆ విగ్ర‌హాన్ని మరొకటి ప్రతిష్టించారు.

    Latest articles

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...

    CM Revanth Reddy’s review | మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ.. ఏమేమి చర్చించారంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy's review | వరద ప్రభావంపై మెదక్‌ ఎస్పీ కార్యాలయం (Medak SP...

    More like this

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...