అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో అటవీశాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. అటవీ పక్షులను (Forest birds) విక్రయిస్తున్న ముగ్గురు షాపు యజమానులపై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు.
Forest Department | పక్షులను విక్రయించడం నేరం..
మాలపల్లిలోని పలు షాపుల్లో చిలుకలు (Parrots), కంజు పిట్టలు విక్రయిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు. ఈ దాడిలో అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి సుధాకర్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Forest Department | కఠినచర్యలు తీసుకుంటాం..
అటవీచట్టం (Forest Act) ప్రకారం పక్షులను విక్రయించడం నేరమని అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్గౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మాలపల్లిలో పక్షులు పెంచి విక్రయిస్తున్నట్లుగా తమకు పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో మెరుపుదాడులు చేశామన్నారు.