ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిASHA Workers | చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట.. కలెక్టరేట్​ ఎదుట ఆశా...

    ASHA Workers | చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట.. కలెక్టరేట్​ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: ASHA Workers | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు చనిపోయారని అధికారులను సెలవు అడిగితే చావులో శవంతో ఫొటో దిగి పంపాలని అడుగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్లు కలెక్టరేట్​ను (Kamareddy Collectorate) ముట్టడించారు. దాంతో కలెక్టరేట్ వద్ద బారికేడ్లు పెట్టి ఆశాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. జిల్లాలో వైద్యాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తమపై వారికి కాకుండా తమకు పనులు చెబుతున్నారని వాపోయారు. అధికారుల పర్యటనల సమయంలో రాత్రి వరకు ఉండాల్సి వస్తోందని, ఒకవేళ ఉండకపోతే మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ASHA Workers | జాబ్​ చార్ట్​ ఒకటి.. పనిచేసేది ఒకటి..

    అధికారుల పర్యటన సమయంలో ఏఎన్ఎంలు (ANM) ఉండడం లేదని, తమనే టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. డెలివరీల సమయంలో ఆస్పత్రికి వెళ్తే రెండురోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. తమకు ఉన్న జాబ్ చార్ట్ ఒకటని, చేసే విధులు వేరని పేర్కొన్నారు. ఆదివారం కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సబ్ సెంటర్లలో డ్యూటీలు వేస్తున్నారని, సబ్ సెంటర్​కు వెళ్తే గ్రామాల్లో ప్రజల బాధలు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. రెండు నెలల నుంచి వేతనాలు పెండింగ్​లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు.

    ASHA Workers | 2వ తేదీనుంచి సహాయ నిరాకరణ..

    వచ్చేనెల 1వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకుంటే 2వ తేదీ నుంచి సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. సుమారు గంట తర్వాత ఇన్​ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్​వో (Incharge Deputy DMHO) సంధ్య ఆశాల వద్దకు చేరుకుని వారి సమస్యలు నోట్ చేసుకున్నారు. ఆదివారం డ్యూటీలు మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఇచ్చామని, ఆశలకు కాదన్నారు. డెలివరీల కోసం వెళ్లినప్పుడు ఆస్పత్రిలో ఉండడానికి ఒక గదిని ఏర్పాటు చేయాలనే విషయమై మాట్లాడతామన్నారు. దీంతో ఆశా కార్యకర్తలు ఆందోళన విరమించారు.

    Latest articles

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    mid-day meal | మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: mid-day meal : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌...

    More like this

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...