అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | వికలాంగులను లక్ష్యంగా చేసుకుని “సున్నితత్వం లేని జోకులు” చేసినందుకు సుప్రీంకోర్టు సోమవారం పలువురు హాస్యనటుల(Comedians)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు క్షమాపణ చెప్పడమే కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆదేశించింది.
కమెడియన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ తమ స్టాండ్-అప్ కంటెంట్లో వికలాంగులను ఎగతాళి చేశారని పేర్కొంటూ వికలాంగుల హక్కుల సంస్థ అయిన SMA క్యూర్ ఫౌండేషన్(SMA Cure Foundation) దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ సూర్య కాంత్, జోయ్మల్య బాగ్చిల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court | జరిమానా తప్పదు.. సున్నితత్వం లేదా?
హాస్యం పేరుతో అత్యంత దారుణంగా ప్రవర్తించారని కోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస సున్నితత్వం (ఇన్ సెన్సిటివ్) కూడా వ్యవహరించారని మండిపడింది. ఇవాళ వికలాంగుల గురించి తప్పుగా మాట్లాడారు. రేపు సీనియర్ సిటిజన్లు, పిల్లల గురించి కూడా మాట్లాడుతారు. ఇది ఎక్కడ ముగుస్తుందని ప్రశ్నించింది. కమెడియన్లు కోర్టుకు క్షమాపణలు చెప్పగా, తమకు మాత్రమే కాదని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. “మీరు కోర్టు ముందు క్షమాపణలు చెబితే సరిపోదు. మీ సోషల్ మీడియాలో కూడా అదే చెప్పండి” అని బెంచ్ హాస్యనటులకు తెలిపింది. జరిమానా విషయాన్ని నిర్ణయిస్తామని జస్టిస్ సూర్య కాంత్(Justice Surya Kant), జోయ్మల్య బాగ్చి(Joymalya Bagchi)ల ధర్మాసనం కూడా తెలిపింది.
Supreme Court | ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు..
ఇతరులతో నవ్వడానికి, ఇతరులను చూసి నవ్వడానికి చాలా తేడా ఉందని కోర్టు పేర్కొంది. ఇతరులను నవ్వించడానికి కొందరిని కించపరచడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. హాస్యం జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ, ఇతరులతో నవ్వడం వేరు.. ఇతరులను చూసి నవ్వడం మధ్య స్పష్టమైన రేఖ ఉందని జస్టిస్ జోయ్మల్య బాగ్చి నొక్కిచెప్పారు. “హాస్యం జీవితంలో ఒక భాగమైంది. కానీ మనం ఇతరులను చూసి నవ్వడం ప్రారంభించి, వారి సున్నితత్వానికి భంగం కలిగించినప్పుడు… అది సమస్యాత్మకంగా మారుతుంది” అని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ తమ ప్రసంగాలతో వ్యాపారం చేస్తున్నారని, హాస్యాన్ని వినోదం కాకుండా లాభం కోసం వాడుకుంటున్నారని కోర్టు మండిపడింది. “…ప్రభావశీలులు అని పిలవబడే వారు తాము వ్యాపారం చేస్తుమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేందుకు సమాజాన్ని పెద్దగా ఉపయోగించకూడదు. ఇది వాక్ స్వేచ్ఛ మాత్రమే కాదు, ఇది వాణిజ్య ప్రసంగం” అని న్యాయమూర్తి పేర్కొన్నారు.