Bodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..
Bodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. చివరికి భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య(Suicide) చేసుకునేలా ప్రేరేపించాయి. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి(CI Chandrasekhar Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్య పేట (Jaggaiah Peta) మండలానికి చెందిన పసుపులేటి పూజితను అదే మండలానికి చెందిన పసుపులేటి సాయితో గతేడాది మార్చి 28న వివాహం జరిగింది. ఇద్దరు కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ (Ashoke Nagar) కాలనీలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి భర్త సాయి వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడనే విషయంపై భార్య పూజిత ప్రశ్నించగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.

అలాగే వివాహ సమయంలో ఒప్పుకున్న అర ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసే విషయంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని, తనని ప్రతి విషయంలో భర్త సాయి ఇబ్బంది పెడుతున్నాడని మనస్థాపం చెందిన పూజిత బిల్డింగ్ పైనుంచి దూకి మృతి చెందిందని సీఐ తెలిపారు. మృతురాలి తండ్రి కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదుతో పూజిత భర్త సాయిపై కేసు నమోదు చేశామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూజిత మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బంధువులకు అప్పగించామన్నారు.