అక్షరటుడే, డిచ్పల్లి: Railway gate | మండలంలోని ఘన్పూర్–డిచ్పల్లి (Ghanpur-Dichpally) మధ్య రైల్వేగేట్ మరో రెండురోజులు మూసి ఉంచనున్నారు. పట్టాల మరమ్మతులు పూర్తి కానందున ఈనెల 26 సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేట్ మూసి ఉంచనున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Railway gate | సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బందులు..
మండలంలోని ఘన్పూర్-డిచ్పల్లి మధ్య రైల్వేగేట్ను మొదట ఈనెల 21వ తేదీ నుంచి 24 తేదీ వరకు గేట్ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు డిచ్పల్లి (Dichpally) పంచాయతీ కార్యదర్శి రమేశ్ (Panchayat Secretary Ramesh) గత సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో వాహనదారులు 21వ తేదీ నుంచి ఇతర మార్గాల ద్వారా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కానీ పనులు పూర్తికాకపోవడంతో మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు.