ePaper
More
    HomeజాతీయంEngineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజులు పెంచాలనే నిబంధన ఉంది. గతంలో 2022లో ఫీజులు పెంచారు. దీంతో ఈ ఏడాది ఫీజులు పెంచాలని పలు కాలేజీలు హైకోర్టును (High Court) ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం వద్దే తేల్చుకోవాలని కాలేజీలకు కోర్టు సూచించింది. అలాగే ఫీజుల పెంపునకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    హైకోర్టు ఆదేశాల మేరకు ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం గత నెల 25న కమిటీ వేసింది. ఈ కమిటీ ఆయా కాలేజీల్లో పరిశీలన జరిపి నివేదిక ఇచ్చిన అనంతరం ఫీజులపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాజాగా ప్రభుత్వం (government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కాలేజీలు అందించే అకౌంట్స్‌తో పాటు విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఫీజులు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫీజుల పెంపు నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    Engineering colleges | అన్ని అంశాలు పరిశీలించాకే..

    రాష్ట్రంలో ప్రస్తుతం చాలా ఇంజినీరింగ్​ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేవు. బోధన సిబ్బంది, ల్యాబ్​లు లేకపోయినా పలు కాలేజీలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్‌ రికగ్నేషన్ అమలు, ఆధార్‌ ఆధారిత ఫీజుల చెల్లింపులు (Aadhaar-based fee payments) అంశాలను ప్రభుత్వం పరిశీలించనుంది. నాణ్యమైన విద్య (quality education) అందిస్తున్నారా.. చదువు అయిపోయాక ప్లేస్​మెంట్స్​ కల్పిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులు పెంచాలని సర్కార్​ నిర్ణయించింది.

    Engineering colleges | కమిటీ సభ్యులు వీరే..

    తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGHEC) ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని ఫీజుల నిర్ధారణ కమిటీ ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించింది. సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన (Technical Education Commissioner Sridevasena), ఏసీడీడీ కమిషన్, డైరెక్టర్ ఎన్ క్షితిజ, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, టీజీసీహెచ్ఈ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, హైదరాబాద్ జేఎన్​టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఓయూ డీన్ క్రిష్ణయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

    Latest articles

    Chennai Airport | చెన్నై ఎయిర్ పోర్టులో హై గ్రేడ్ గంజాయి.. విలువ రూ.12 కోట్ల పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21)...

    Tollywood Movie shootings | ప్రొడ్యూసర్లు – ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వివాదానికి తెర.. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood Movie shootings : ప్రొడ్యూసర్లు(producers), ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మధ్య వివాదానికి తెర పడింది....

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    More like this

    Chennai Airport | చెన్నై ఎయిర్ పోర్టులో హై గ్రేడ్ గంజాయి.. విలువ రూ.12 కోట్ల పైనే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21)...

    Tollywood Movie shootings | ప్రొడ్యూసర్లు – ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వివాదానికి తెర.. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood Movie shootings : ప్రొడ్యూసర్లు(producers), ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మధ్య వివాదానికి తెర పడింది....

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...