అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని (Banswada Mandal) బోర్లం క్యాంప్ శివారులో ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టింది.
ఈ సంఘటనలో బాన్సువాడ మండలం సోమ్లనాయక్ తండాకు (Somlanayak Thanda) చెందిన రమావత్ గోవింద్ మృతి చెందారు. రమావత్ రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ (Nizamabad) ఆస్పత్రికి తరలించారు. మరో బైక్పై ఉన్న ఇద్దరికి సైతం గాయాలయ్యాయి. బోర్లం క్యాంపు శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో వేరే మార్గం ద్వారా ద్విచక్ర వాహనదారులు వెళ్లే ప్రయత్నంలో కామారెడ్డికి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. అనంతరం గ్రామస్థులు గోవింద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.