అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు ట్రెయినీ ఎస్హెచ్వో Trainee SHo లను నియమించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర SP Rajesh Chandra బుధవారం తెలిపారు. లింగంపేట Lingampet ఎస్హెచ్వోగా రాఘవేంద్ర, నస్రుల్లాబాద్ nasrullabad కు అరుణ్ కుమార్, రామారెడ్డి ramareddy కి నవీన్ చంద్రను నియమించినట్లు పేర్కొన్నారు. వారు నెల రోజుల పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో పని చేస్తారని వివరించారు. ప్రజలు, బాధితులతో ఎలా మాట్లాడాలి, ఫిర్యాదులపై ఎలా స్పందించాలి, పెట్రోలింగ్, స్టేషన్ నిర్వహణ తదితర విషయాలపై అవగాహన పెంచుకుంటారని పేర్కొన్నారు.