ePaper
More
    HomeతెలంగాణKodangal | తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

    Kodangal | తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : kodangal | అంబులెన్స్​ (ambulance) లేకపోవడంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై తీసుకెళ్లారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో (Narayanpet district) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​ అవుతున్నాయి.

    సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్​ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన మొగులప్ప (28)ను టిప్పర్​ ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే 108కు ఫోన్​ చేసినా అందుబాటులో లేదు. దీంతో మృతదేహాన్ని ఓ తోపుడు బండిపై వేసుకొని అర కిలోమీటర్​ దూరంలో ఉన్న ఆస్పత్రి వరకు లాక్కెళ్లారు.

    kodangal | తీవ్ర విమర్శలు

    మృతదేహాన్ని తోపుడి బండిపై తీసుకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నారు. మృతదేహాన్ని ఇలా తీసుకు వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పేదవాడి మృతిపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై మండి పడుతున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    Latest articles

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....

    Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ Q1 ఫలితాలు: లాభాలు తగ్గుముఖం, ఆదాయం, వ్యాపారం వృద్ధి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1FY26)...

    More like this

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....