అక్షరటుడే, ఇందూరు: Borgaon(p) ZPHS | పదో తరగతి ఫలితాల్లో బోర్గాం(పి) జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల హెడ్మాస్టర్ శంకర్ తెలిపారు. 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. 194 మంది పరీక్షలు రాయగా.. 187 మంది పాసయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.