ePaper
More
    HomeజాతీయంRailway Passengers | రైల్వే ప్రయాణికులకు అలర్ట్​.. నాందేడ్ ​– నిజామాబాద్​ – తిరుపతి వీక్లీ...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలర్ట్​.. నాందేడ్ ​– నిజామాబాద్​ – తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ పొడిగింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | నాందేడ్​ – తిరుపతి – నాందేడ్​ మార్గంలో నడుస్తున్న వీక్లీ ఎక్స్​ప్రెస్​ రైళ్ల సేవలను పొడిగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్​ – పెద్దపల్లి మార్గంలో నాందేడ్ – తిరుపతి (07015/16) వీక్లీ ఎక్స్​ప్రెస్(Weekly Express)​ నడుస్తోంది. ఈ రైళ్లలో వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు సేవలను (Train Services) మరో ఏడు నెలలు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి – నాందేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్​ప్రెస్ రైళ్ల సేవలను 2026 మార్చి 28 వరకు పొడిగించినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆంధ్ర, హైదరాబాద్ (Hyderabad)​ వాసులు బాసర క్షేత్రానికి రావడానికి సైతం అనుకూలంగా ఉంటుంది. అయితే వారానికి ఒకసారి మాత్రమే ఈ రైలు నడుపుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని రెగ్యులర్​ ట్రైన్​గా (Reguler Train)​ మార్చాలని కోరుతున్నారు. లేదంటే వారానికి కనీసం మూడు సార్లయిన నడిపితే మేలంటున్నారు.

    Railway Passengers | ఆ స్టేషన్లలో ఆపాలి

    తిరుపతి – నాందేడ్​ ఎక్స్​ప్రెస్​ రైలులో ఎంతో మంది ప్రయాణం చేస్తారు. ఉమ్మడి నిజామాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాల ప్రజలు ఈ రైలులో తిరుపతి వెళ్తుంటారు. అయితే ఈ రైలుకు కోరుట్ల, మెట్​పల్లి, ఆర్మూర్ రైల్వే స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించాలని ప్రయాణికులు (Railway Passengers) కోరుతున్నారు. ప్రస్తుతం ఆయా స్టేషన్లలో హాల్ట్​ లేకపోవడంతో నిజామాబాద్​, బాసరకు వెళ్లి ప్రయాణికులు ట్రెయిన్​ ఎక్కుతున్నారు. ఈ రైలును వారానికి మూడు రోజులు నడిపే విధంగా నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధర్మపురి, కేంద్ర సహాయ మంత్రి బండి, కరీంనగర్ ఎంపీ సంజయ్ కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Singitham Project | సింగితం గేట్లు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Singitham Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి ఎగువ...

    Armoor | ఆర్మూర్​ మున్సిపల్​ కమిషనర్​కు అవార్డు

    అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) ఉత్తమ సేవలకు...

    Pavan Kalyan | ‘ఓటు చోరీ’ ఆరోపణల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. పవన్​ కల్యాణ్​​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఓటు చోరీ (Vote Chori) ఆరోపణల వెనక అంతర్జాతీయ కుట్ర...

    Harish Rao | కాంగ్రెస్ పాల‌న‌లో ప‌న్నుల పోటు.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | పాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేస్తోందని...

    More like this

    Singitham Project | సింగితం గేట్లు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Singitham Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి ఎగువ...

    Armoor | ఆర్మూర్​ మున్సిపల్​ కమిషనర్​కు అవార్డు

    అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) ఉత్తమ సేవలకు...

    Pavan Kalyan | ‘ఓటు చోరీ’ ఆరోపణల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. పవన్​ కల్యాణ్​​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఓటు చోరీ (Vote Chori) ఆరోపణల వెనక అంతర్జాతీయ కుట్ర...