అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | నాందేడ్ – తిరుపతి – నాందేడ్ మార్గంలో నడుస్తున్న వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల సేవలను పొడిగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ – పెద్దపల్లి మార్గంలో నాందేడ్ – తిరుపతి (07015/16) వీక్లీ ఎక్స్ప్రెస్(Weekly Express) నడుస్తోంది. ఈ రైళ్లలో వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు సేవలను (Train Services) మరో ఏడు నెలలు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి – నాందేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల సేవలను 2026 మార్చి 28 వరకు పొడిగించినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆంధ్ర, హైదరాబాద్ (Hyderabad) వాసులు బాసర క్షేత్రానికి రావడానికి సైతం అనుకూలంగా ఉంటుంది. అయితే వారానికి ఒకసారి మాత్రమే ఈ రైలు నడుపుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని రెగ్యులర్ ట్రైన్గా (Reguler Train) మార్చాలని కోరుతున్నారు. లేదంటే వారానికి కనీసం మూడు సార్లయిన నడిపితే మేలంటున్నారు.
Railway Passengers | ఆ స్టేషన్లలో ఆపాలి
తిరుపతి – నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ఎంతో మంది ప్రయాణం చేస్తారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఈ రైలులో తిరుపతి వెళ్తుంటారు. అయితే ఈ రైలుకు కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ రైల్వే స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించాలని ప్రయాణికులు (Railway Passengers) కోరుతున్నారు. ప్రస్తుతం ఆయా స్టేషన్లలో హాల్ట్ లేకపోవడంతో నిజామాబాద్, బాసరకు వెళ్లి ప్రయాణికులు ట్రెయిన్ ఎక్కుతున్నారు. ఈ రైలును వారానికి మూడు రోజులు నడిపే విధంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, కేంద్ర సహాయ మంత్రి బండి, కరీంనగర్ ఎంపీ సంజయ్ కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.