అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరీవాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్ను బుధవారం అధికారులు తెరిచారు. ఎగువభాగం నుంచి భారీగా ఇన్ఫ్లో రావడంతో ముందస్తుగా ఒక గేటును ఎత్తారు. అక్కడి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతోందని ప్రాజెక్టు ఈఈ సోలోమాన్ పేర్కొన్నారు.
Singur Project | సింగూరులో..
సింగూరు ప్రాజెక్టులో బుధవారం సాయంత్రానికి గాను.. 29.917 టీఎంసీలకుగాను 22.145 టీఎంసీల నీరు నిలువ ఉంది. అయితే ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 4,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 11నంబర్ గేటు ద్వారా 8,950 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేశారు.
Singur Project | నిజాంసాగర్ ప్రాజెక్టులో..
నిజాంసాగర్ ప్రాజెక్టులో (Nizamsagar project) బుధవారం సాయంత్రం నాటికి. 1393.04 అడుగులు 5.567 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 2,125 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి భారీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉండడంతోనే సింగూరు ప్రాజెక్టు వరద గేటు ద్వారా నీటిని నిజాంసాగర్లోకి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోలో హెచ్చుతగ్గులకు తగ్గట్లుగా నీటి విడుదలలోనూ హెచ్చుతగ్గులు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.