అక్షర టుడే, ఆర్మూర్ :AICWC Secretary | బాల్కొండ మండలం వన్నెల్ (బి )కి చెందిన రాజుల రామనాధం(Rajula Ramanatham) తెలంగాణ రాష్ట్ర ఏఐసీడబ్ల్యూసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా జాతీయ వినియోగదారుల సమాఖ్య ఏఐసీడబ్ల్యూసీ(All India Consumer Welfare Council) చైర్మన్ విఖ్యత్ షేనాయ్, ప్రిన్సిపాల్ జనరల్ సెక్రెటరీ దేవేంద్ర తివారిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పన్నెండేళ్ళుగా వినియోగదారుల ఉద్యమంలో చురుకుగా సేవలందిస్తున్న తనకు రాష్ట్రస్థాయి గుర్తింపు(State Level Recognition) లభించడం ఆనందంగా ఉందన్నారు.