అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Ukrainian President Zelensky) సోమవారం ఫోన్ చేశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war)పై ప్రధానికి ఆయన వివరించారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) సైతం మోదీకి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. యుద్ధం, రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని జెలెన్స్కీ పేర్కొన్నారు.
PM Modi | మద్దతు ఇవ్వాలి
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు (US Tariffs) విధించిన విషయం తెలిసిందే. భారత్ ఆయిల్, ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ ఉండడంతో ఆ డబ్బును ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వినియోగిస్తుందని డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేయడం గమనార్హం. రష్యా–ఉక్రెయిన్యుద్ధాన్ని ముగించడానికి శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. కాగా అమెరికాలో (America) ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు పుతిన్తో డోనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. యుద్ధం విషయంలో ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అయితే తాము లేకుండా శాంతి చర్చలు ఫలించవని జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా మోదీతో మాట్లాడారు.
PM Modi | శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
వివాదాన్ని త్వరగా, శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరంపై భారతదేశం స్థిరమైన వైఖరిని తెలియజేసినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషయంలో సాధ్యమైన ప్రతి సహకారాన్ని అందించడానికి, అలాగే ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు.