అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 22 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (Police Commissioner P. Sai Chaitanya) వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి సీపీ అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత సర్కిల్స్, పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదు దారుల సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా.. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని సీపీ తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.