అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు జలాశయంలోకి వరద పెరిగింది. ప్రాజెక్టులోకి ఆదివారం నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. సోమవారం సాయంత్రానికి 6,070 క్యూసెక్కులకు పెరిగినట్లు ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.
Nizamsagar project | ఐదు టీఎంసీలకు పెరిగిన నీటిమట్టం
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఐదు టీఎంసీలకు పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1405. 00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1392.16 అడుగుల (5.067 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా.. ఎగువ భాగం నుంచి 6070 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతుండడం, ఎక్కువ నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఇన్ఫ్లో పెరిగి ప్రాజెక్టు నిండితే వానాకాలం పంటల సాగుకు ఎలాంటి ఢోకా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.