Navipet Mandal

Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ ​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

అతడితో పాటు అతడి స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నవీపేట మండల (Navipet Mandal) జగ్గారావు ఫారం వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నవీపేట ఎస్సై వినయ్ (Navipet SI Vinay) తెలిపిన వివరాల ప్రకారం రాఖీ పండుగ సందర్భంగా బాసరకు చెందిన యువకుడు సాయిబాబు నిజామాబాద్​లో (Nizamabad) ఉంటున్న అక్క ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి అతని స్నేహితుడితో కలిసి వచ్చాడు.

రాఖీ కట్టించుకుని శనివారం మధ్యాహ్నం తిరిగి బాసరకు వెళ్తుండగా.. నవీపేట మండలం జగ్గారావు ఫారం వద్ద కంటైనర్​ను వెనుక నుండి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సాయిబాబు(19) అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు అరవింద్​కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు సాయిబాబు బాసరలోని సరస్వతి దేవాలయం (Saraswati Temple) వద్ద ఓ షాపులో పనిచేస్తున్నాడు. మృతుడి మేనమామ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.