ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన...

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్​ శుక్రవారం సిట్​ విచారణకు (SIT Investigation) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు సిట్​ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్​ ట్యాపింగ్​కు ​(Phone Tapping) గురైన బాధితుల స్టేట్​మెంట్​ను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలోనే విచారణకు హాజరు కావాలని బండి సంజయ్​కి ​(Bandi Sanjay) సిట్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే పార్లమెంట్​ సమావేశాల నేపథ్యంలో ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు.

    Phone Tapping Case | కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య దోస్తీ

    సిట్​ విచారణ నిమిత్తం కేంద్ర మంత్రి బండి సంజయ్​ దిల్​కుషా గెస్ట్​ హౌజ్​కు ​(Dilkusha Guest House) చేరుకున్నారు. అంతకుముందు ఆయన ఖైరతాబాద్​ హనుమాన్​ ఆలయంలో (Khairatabad Hanuman Temple) ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ కార్యకర్తలో ర్యాలీగా ఆయన దిల్​కుషా గెస్ట్​ హౌజ్​కు చేరుకున్నారు. విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని ఆయన పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో అత్యధికంగా తన ఫోన్‌కాల్స్ ట్యాప్ చేశారని చెప్పారు. ఫోన్​ ట్యాపింగ్​ అంశాన్ని తానే బయట పెట్టినట్లు చెప్పారు. బీఆర్​ఎస్ (BRS)​, కాంగ్రెస్​ మధ్య దోస్తీ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే రేవంత్​రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం సిట్​కు ఇస్తానని చెప్పారు.

    Phone Tapping Case | సీబీఐకి అప్పగించాలి

    ఫోన్​ ట్యాపింగ్​ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. అయితే సిట్​ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) బీఆర్​ఎస్​ను కాపాడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ టైమ్‌పాస్ వ్యవహారంలా ఉందన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు.

    Phone Tapping Case | మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్‌గా..

    బీఆర్​ఎస్​ హయాంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బండి సంజయ్​ ఫోన్​ ట్యాప్​ చేసినట్లు అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్‌పై నిఘా వర్గాలు పలు ఆధారాలు అందించాయి. వాటిని ఆయన సిట్​కు సమర్పించనున్నారు. అయితే బండి సంజయ్​ మాట్లాడిన ప్రతి ఫోన్​ కాల్​ ట్యాప్​ అయినట్లు సిట్​ అధికారులు (Sit Officers) తెలిపారు. ఆందోళనలు, కేసుల విచారణలో న్యాయవాదులతో సంభాషణలు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు.

    Latest articles

    Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని చంద్రశేఖర్​ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) 2007–08...

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    More like this

    Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని చంద్రశేఖర్​ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) 2007–08...

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...