అక్షరటుడే, ఎల్లారెడ్డి : EAPCET | ఈఏపీసెట్ EAPCET పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం మేడ్చల్ medchal రింగ్రోడ్డు ring road సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట lingampeta మండలం నల్లమడుగు పెద్ద తండాకు చెందిన అర్చన (17) ఇంటర్ పూర్తయింది. ఆమె ఈఏపీసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా మేడ్చల్ శివారులోని ఓ కాలేజీలో సెంటర్ పడింది. దీంతో పరీక్ష కోసం మంగళవారమే హైదరాబాద్ hyderabad వెళ్లిన అర్చన అక్కడ బంధువుల ఇంట్లో ఉంది. బుధవారం ఉదయం పరీక్ష రాయడానికి తన సోదరుడితో కలిసి బైక్పై వెళ్తుండగా వీరిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో అర్చన రోడ్డుపై పడిపోగా ఆమెపైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అన్న అరవింద్కు గాయాలయ్యాయి.
