అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Forest Department | మోపాల్ (Mopal) మండలలోని బైరాపూర్లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు వేధిస్తున్నారని నిరసిస్తూ ఓ రైతు గడ్డిమందు తాగాడు.. వివరాల్లోకి వెళ్తే.. బైరాపూర్ గ్రామంలో కొన్నిరోజులుగా పోడు భూములను సాగు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం అటవీశాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు.
భూముల్లో సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్ అధికారులు గడ్డిమందును తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అధికారులను గ్రామంలోకి రానీయకుండా రైతులు నిరసన తెలిపారు.
Forest Department | గడ్డిమందు తాగిన రైతు..
ఫారెస్ట్ అధికారులు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకోగా.. ఇదే సమయంలో ఓ రైతు అధికారులు తీసుకొచ్చిన గడ్డిమందు తాగాడు. దీంతో అతడిని ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు (GGH Nizamabad) తరలించారు. కొన్నేళ్లుగా తాము పోడుభూములను సాగు చేసుకుంటున్నామని.. ఫారెస్ట్ అధికారులు తమను వేధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని వారు నిరసన తెలిపారు.
పురుగుల మందు తాగిన రైతును ఆస్పత్రికి తరలిస్తున్న గ్రామస్థులు
బైరాపూర్ గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత