ePaper
More
    HomeజాతీయంKubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్​లో (Madhya Pradesh)​ విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్ ధామ్‌లో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇద్దరు భక్తులు మృతి చెందారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరాదిలో ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తారు. ముఖ్యంగా కన్వర్​ యాత్ర (Kanwar Yatra) చేపట్టి గంగా జలాలతో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో కుబ్రేశ్వర్ ధామ్‌లో పండిట్ ప్రదీప్ మిశ్రా కన్వర్ యాత్ర నిర్వహించనున్నారు. అయితే మంగళవారం ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

    కుబ్రేశ్వర్ ధామ్ (Kubreshwar Dham) నుంచి చితావాలియా హేమా గ్రామం వరకు జరిగే కన్వర్ యాత్ర ఆగస్టు 6న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం భక్తులు ఒక రోజు ముందుగానే ఆలయానికి రావడం ప్రారంభించారు. అధికారులు భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు అనుకున్నదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులకు సౌకర్యాలు లేకపోవడం, భండార పంపిణీ, దర్శనం కోసం పరిమిత స్థలంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు (Devotees) మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    READ ALSO  Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    Kubreshwar Dham Stampede | నాలుగు వేల మంది భక్తుల కోసం ఏర్పాట్లు

    ధామ్​ వద్ద 4 వేల మంది భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. నమక్ చౌరాహా, రాధేశ్యామ్ కాలనీ, బజరంగ్ అఖారా, అటల్ పార్క్, నగరంలోని ఇతర ప్రదేశాలలో నాలుగు వేలకు పైగా భక్తుల బస కోసం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఒక రోజు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట (Stampede) జరగడానికి ముందు ఉన్నతాధికారులు ధామ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. అయితే అధికారుల సూచనలు అమలు కాలేదు.

    కాగా.. ఇటీవల ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో గల మానసాదేవి ఆలయంలో కూడా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మానస దేవి ఆలయానికి జులై 27న భారీగా భక్తులు (Huge Devotees) వచ్చారు. అయితే ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. విద్యుత్ వైర్​ తెగిపడడంతో షాక్​ కొడుతుందని పుకారు వ్యాప్తి చెందడంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోగా ఏడుగురు మృతి చెందారు. దాదాపు 55 మంది గాయపడ్డారు.

    READ ALSO  Bihar CM | బీహార్‌లో ఆగ‌ని వ‌రాల జ‌ల్లు.. ఆశ కార్మికుల వేత‌నం డ‌బుల్

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....