అక్షరటుడే, వెబ్డెస్క్ : Explosion | యాదాద్రి భువనగిరి Yadadri Bhuvanagiri జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లాజివ్ కంపెనీలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ hyderabad తరలించారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు police ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.