CM Reavnth Reddy
CM Revanth Reddy | మోదీని దింపేందుకు ఆర్​ఎస్​ఎస్​ ప్రయత్నం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Narendra Modi) పదవిలో నుంచి దింపడానికి ఆర్​ఎస్​ఎస్​ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన వారు పదవులను వదులుకోవాలని ఇటీవల ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్ (RSS chief Mohan Bhagwat) పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్​ లీగల్​ కాన్​క్లేవ్​లో ​(Congress Legal Conclave) ఆయన మాట్లాడారు.

పదవి వదులుకోవాలని ఆర్​ఎస్​ఎస్​ సూచించినా.. మోదీ అందుకు సిద్ధంగా లేరన్నారు. గతంలో అద్వానీ, మురళీమనోహర్​ జోషిని 75 ఏళ్లు నిండిన వారు పదవులకు దూరంగా ఉండాలని పక్కన బెట్టారని సీఎం గుర్తుచేశారు. వారికి వర్తించిన నిబంధన మోదీకి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. మోదీని కుర్చీ నుంచి దింపడం ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ వాళ్ల కాదని రేవంత్​రెడ్డి అన్నారు. అది రాహుల్​ గాంధీ (Rahul Gandhi) మాత్రమే సాధ్యమన్నారు.

CM Revanth Reddy | రాహుల్​ గాంధీని ప్రధాని చేయాలి

రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్​ కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా కాంగ్రెస్​ పజల మధ్యే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే పదవిలో కూర్చుంటాయని.. ఓడితే ఇంట్లో కూర్చుంటాయని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్​ అని రేవంత్​రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​, బీజేడీ, ఆర్జేడీ లాంటి పార్టీలు అన్ని స్వాతంత్య్రం తర్వాతే వచ్చాయన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.