ePaper
More
    Homeక్రీడలుIND vs ENG | ప్రసిధ్ కృష్ణ - జో రూట్ మధ్య మాటల తూటాలు.....

    IND vs ENG | ప్రసిధ్ కృష్ణ – జో రూట్ మధ్య మాటల తూటాలు.. కేఎల్​ రాహుల్ అసహనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(England batsman Joe Root) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మైదానంలో వీరిద్దరి మధ్య చిన్న‌పాటి ఘర్షణతోపాటు వాగ్వాదం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్ సమయంలో క్రీజులోకి కొత్తగా వచ్చిన జో రూట్ ప్రసిధ్ వేసిన బంతిని వదిలేశాడు. వెంటనే ప్రసిధ్ అతని దగ్గరకు వెళ్లి ఏదో వ్యాఖ్య చేశాడు. దీనికి రూట్ కూడా బదులిచ్చాడు. ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించిన జో రూట్, ప్రసిధ్‌ను చూసి ఏదో అన్నాడు.

    IND vs ENG | మాట‌ల తూటాలు..

    ఇద్దరి మధ్య మాటల తూటాలు ప్రారంభమైన వేళ ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన ప్రసిధ్ కృష్ణను (Prasidh Krishna) మందలించగా, భారత ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (Kl Rahul) దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. కేవలం ప్రసిధ్‌ను మందలించడంపై అభ్యంతరం చెబుతూ, ఇరువురి త‌ప్పు ఉందని అంపైర్‌ను నిలదీశాడు. ఇది మాత్రమే కాదు, అంతకుముందు ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను ఔట్ చేసిన టీమిండియా పేసర్ ఆకాష్ దీప్(Team India pacer Akash Deep), అతని భుజంపై చేతులు వేసి సెండాఫ్ ఇచ్చిన ఘటన కూడా ఉద్రిక్తతను పెంచింది. ఈ సిరీస్ ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య వేడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జో రూట్‌తో జరిగిన మాటల యుద్ధం తర్వాత ప్రసిధ్ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను గడగడలాడించాడు. మొత్తం నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.

    READ ALSO  IND vs ENG | రెండో రోజు ఆట మొద‌లైన అర‌గంటకే కుప్ప‌కూలిన భార‌త్.. స్కోర్స్ ఎంతంటే...!

    సిరాజ్ కూడా నాలుగు వికెట్ల‌తో ఇంగ్లండ్ న‌డ్డి విరిచాడు. ఈ క్ర‌మంలో ఆతిథ్య జట్టు 247 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 23 పరుగుల లీడ్ మాత్రమే ద‌క్కింది . ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) 51 పరుగలు, ఆకాష్​ దీప్​ నాలుగు పరుగులతో క్రీజ్​లో ఉన్నారు. జైస్వాల్ క్రీజులో నిలదొక్కుకుంటే.. మూడో రోజు మొదటి గంటన్నరలో టీమిండియా స్ట్రాంగ్ పొజీష‌న్‌లో ఉంటుంది. జైస్వాల్‌తో పాటు క్రీజులో ఉన్న ఆకాశ్ దీప్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొని, మన లీడ్‌ను పెంచితే భార‌త్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని స‌మం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...