ePaper
More
    HomeజాతీయంRailway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు పోనున్నాయి. ఉత్తరాదితో తెలంగాణను కలిపే కాజీపేట–బల్లార్షా (Kazipet–Ballarshah) మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్ (Railway Line)​ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో లైన్​ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. త్వరలో పనులు పూర్తి చేసి నాలుగో లైన్​ నిర్మాణం చేపట్టనున్నారు. కాజీపేట నుంచి బల్లార్షా వరకు 234 కిలోమీటర్ల మేర నాలుగో లైన్​ నిర్మించనున్నారు. దీనికి వచ్చే బడ్జెట్​లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. జులై 19న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)​ రాష్ట్రంలో పర్యటించారు. నాలుగో లైన్​ నిర్మాణం చేపడుతామని ఆ సమయంలో ఆయన తెలిపారు.

    READ ALSO  Kaleshwaram Commission | రేపు ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్​ నివేదిక!

    Railway Line | నిత్యం రైళ్ల రద్దీ

    ఉత్తరాది రాష్ట్రాలతో దక్షిణాదిని అనుసంధానించే కాజీపేట–బల్లార్షా మార్గంలో నిత్యం వందల రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రైళ్ల (Trains) రద్దీని దృష్టిలో పెట్టుకొని మూడో లైన్​ నిర్మాణం చేపట్టారు. రైళ్లు అధికంగా తిరుగుతుండడంతో క్రాసింగ్​ సమయంలో ప్రస్తుతం చాలా సమయం స్టేషన్లలో నిలిపి ఉంచాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మూడు, నాలుగో లైన్లు అందుబాటులోకి వస్తే క్రాసింగ్​ల బాధ తప్పి.. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నాలుగు లైను నిర్మిస్తే గూడ్స్​ కోసం సెపరేట్​ ట్రాక్​ వినియోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Railway Line | సర్వే పూర్తి

    నాలుగు లైన్​కు సంబంధించి అధికారులు సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం 205 కిలోమీటర్ల మేర మూడో లైన్​ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో 177 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో మహారాష్ట్ర పరిధిలో 46 కి.మీ. మేర పనులు పూర్తికాగా తెలంగాణలోని ఆసిఫాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, రేచినిరోడ్‌-బెల్లంపల్లి-మందమర్రి మధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగో లైన్​ను రూ.3 వేల కోట్లతో 234 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఇందులో తెలంగాణలో 80 శాతం, మహారాష్ట్రలో 20 శాతం ఉంది. ప్రస్తుతం సర్వే పూర్తి కావడంతో అధికారులు డీపీఆర్​ రూపొందిస్తున్నారు.

    READ ALSO  KTR | స్థానిక ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటన

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...