అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | భాగ్య నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పుష్పక్ (Pushpak) బస్సుల (BUS) ఛార్జీలను భారీగా తగ్గించింది. తాజా నిర్ణయంతో హైదరాబాద్లో ఆయా ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు, ఎయిర్ పోర్టు నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లేవారికి మేలు కలగనుంది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) మార్గంలో ప్రయాణించేవారికి ఛార్జీల భారం తగ్గనుంది. ఈ మార్గంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించేవారికి ప్రయాణ ఛార్జీలను రూ. 50 నుంచి రూ.100 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏఏ మార్గాల్లో ఎంత మేర తగ్గుతున్నాయో వివరాలు వెల్లడించింది.
TGS RTC | ఆయా మార్గాలను పరిశీలిస్తే..
- ఎయిర్ పోర్ట్ – శంషాబాద్(Airport- Shamshabad) : పాత ధర రూ. 200 ; కొత్త ధర రూ. 100
- ఎయిర్ పోర్ట్- మెహదీపట్నం(Airport- Mehdipatnam) : పాత ధర రూ. 350 ; కొత్త ధర రూ. 300
- ఎయిర్ పోర్ట్- ఆరాంఘర్ (Airport- Aramghar) : పాత ధర రూ. 250 ; కొత్త ధర రూ. 200
- ఎయిర్ పోర్ట్- పహాడీషరీఫ్(Airport- Pahadisharif) : పాత ధర రూ. 200 ; కొత్త ధర రూ. 100
- ఎయిర్ పోర్ట్ ఎల్బీ నగర్(Airport LB Nagar) : పాత ధర రూ. 350 ; కొత్త ధర రూ. 300
- ఎయిర్ పోర్ట్- బాలాపూర్(Airport- Balapur) : పాత ధర రూ. 250 ; కొత్త ధర రూ. 200
రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం ఏవైతే ధరలు ఉన్నాయో.. వాటిల్లోనూ రూ. 50 తగ్గించడం విశేషం.
- ఎయిర్ పోర్ట్ – జూబ్లీ బస్ స్టేషన్(Airport- Jubilee Bus Station) : పాత ధర రూ. 450 ; కొత్త ధర రూ. 400
- ఎయిర్ పోర్ట్ – లింగంపల్లి(Airport – Lingampalli) : పాత ధర రూ. 450 ; కొత్త ధర రూ. 400
- ఎయిర్ పోర్ట్- జేఎన్టీయూ/మియాపూర్(Airport- JNTU/Miyapur) : పాత ధర రూ. 450 ; కొత్త ధర రూ. 400