అక్షరటుడే, వెబ్డెస్క్: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ టార్గెట్. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో (Matrimony Websites) ఇలాంటి నవ వరుళ్ల వివరాలు సేకరిస్తుంది. ఇన్స్టా, ఫేస్బుక్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. వారు ఆక్సెప్ట్ చేశాక.. వారిని లైన్లో పెడుతుంది.
తనకు విడాకులయ్యాయని, ఓ బిడ్డ ఉన్నట్లు వారిని ఎమోషనల్గా పడేస్తుంది. చివరికి దగ్గరై పెళ్లి కూడా చేసుకుంటుంది ఈ మహారాష్ట్ర (Maharashtra) మాయలేడి. ఇలా ఏకంగా 8 వివాహాలు చేసుకుంది. తొమ్మిదో వివాహం కోసం ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కింది ఈ నిత్య పెళ్లికూతురు. నాగ్పూర్లో (Nagpur) వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Nagpur : పోలీసుల కథనం ప్రకారం..
సమీరా ఫాతిమా (Sameera Fatima) అనే టీచర్ అందలం ఎక్కేందుకు అడ్డదారి ఎంచుకుంది. వయసు మీదపడి వివాహం కాని ధనవంతులే ఆమె టార్గెట్. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వారికి దగ్గరవుతుంది. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని నమ్మబలుకుతుంది. ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని మాయమాటలు చెబుతుంది. ఎదుటి వ్యక్తిని ముగ్గులోకి దింపి వివాహం చేసుకుంటుంది.
కొన్ని రోజులయ్యాక.. పథకం ప్రకారం వారిని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈమెకు సపోర్టుగా ఆ అమాయక భర్తను బెదిరించే సపరేట్ గ్యాంగ్ను కూడా మెయింటెనెన్స్ చేస్తోంది. వీరి అండతో గత పదిహేనేళ్లలో ఎనిమిది వివాహాలు చేసుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు లాగింది.
Nagpur : విచారణలో దిమ్మ తిరిగే విషయాలు..
తన నుంచి సమీరా బలవంతంగా రూ.50 లక్షలు వసూలు చేసిందని ఆమె బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఈ కిలేడీ విషయం వెలుగు చూసింది. దర్యాప్తులో (investigation) దిమ్మతిరిగే విషయాలు తేలాయి. ఈ మాయలేడీ సమీరా బాధితుల్లో రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) సీనియర్ అధికారులు సైతం ఉన్నట్లు తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఎనిమిది మంది అమాయకులను మోసగించిన సమీరా.. తాజాగా మరో పెళ్లి చేసుకునేందుకు పావులు కదిపింది. అలా జులై 29న నాగ్పూర్లోని ఓ ఛాయ్ దుకాణం వద్ద ఈమె తొమ్మిదో వ్యక్తిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.