అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar : తన సహోద్యోగి (colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. బీహార్లో ఈ ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తూ గత రెండేళ్లుగా తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆరోపించింది. ఈ రెండు సంవత్సరాల్లో అనేక వివిధ కారణాలు చూపించి, మూడు సార్లు అబార్షన్ చేయించాడని వాపోయింది.
Bihar : బాధితురాలి ఫిర్యాదు ప్రకారం..
బాధిత లేడీ కానిస్టేబుల్ బీహార్లోని బక్సార్ జిల్లా (Buxar district) లో పని చేస్తోంది. నిందితుడు గయా జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 2023లో ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అదే ఏడాది ఏప్రిల్లో బాధితురాలు వారణాసికి (Varanasi) వెళ్లినప్పుడు, నిందితుడు ఆమెను హోటల్కు తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Bihar : ఎవరికీ తెలియకుండా..
ఆమె ఎదురు తిరగడంతో బ్రతిమిలాడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అదే సంవత్సరం మేలో బాధితురాలు గర్భం దాల్చడంతో.. ఝార్ఖండ్ (Jharkhand) లోని దేవ్గఢ్ ఆలయంలో ఎవరికీ తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ విడివిడిగా ఉన్నారు. తెలియకుండా ఆమెకు మందులు ఇచ్చి, అబార్షన్ అయ్యేలా చేశాడు.
అలా రెండేళ్లలో మూడు సార్లు అబార్షన్ చేయించాడు. కాగా, సదరు వంచక కానిస్టేబుల్ గత మే నెలలో మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో.. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.