ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు

    Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ (PC Gosh) గురువారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు ఆయన నివేదిక అందించారు. కాళేశ్వరం (Kaleshwaram ) నిర్మాణంలో అక్రమాలు, ప్రాజెక్ట్​ డిజైనింగ్​లో మార్పులు, అనుమతులు లేకుండానే నిధుల విడుదల వంటి అంశాలపై కమిషన్​ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ నివేదికను అధికారులు శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి అందించారు.

    ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నివేదికను సీఎంకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

    READ ALSO  MLAs' party defection | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడే తీర్పు

    Kaleshwaram Commission | ఉన్నత స్థాయి కమిటీ..

    కాళేశ్వరం కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ (High-level committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేయనుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 4న కమిటీ కమిషన్​ నివేదిక సారాంశాన్ని మంత్రిమండలికి సమర్పించనుంది.

    Kaleshwaram Commission | మంత్రివర్గంలో చర్చ

    కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు కమిషన్​ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని కమిషన్​ పేర్కొన్నట్లు సమాచారం. దీనికి పలువురు కారణమని నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నివేదికపై మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో చర్చించనున్నారు. అనంతరం దీనిని అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

    READ ALSO  CM Revanth Reddy | మోదీని దింపేందుకు ఆర్​ఎస్​ఎస్​ ప్రయత్నం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...