ePaper
More
    HomeతెలంగాణACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తూనే ఉన్నారు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే పనులు చేయడం లేదు. నిత్యం ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఓ రెవెన్యూ ఇన్​స్పెక్టర్ (Revenue inspector)​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

    మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ మండల రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ బాల సుబ్రహ్మణ్యం కల్యాణ లక్ష్మి (Kalyana Laxmi) చెక్కు కోసం దరఖాస్తును ప్రాసెస్​ చేయడానికి లంచం డిమాండ్​ చేశాడు. రూ.నాలుగు వేలు ఇస్తేనే దరఖాస్తును ఆమోదిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం రూ.నాలుగు వేల లంచం తీసుకుంటుండగా ఆర్​ఐ బాలసుబ్రహ్మణ్యంను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

    READ ALSO  Mla Prashanth reddy | తులం బంగారం పథకాన్ని వెంటనే అమలు చేయాలి

    ACB Trap | అవినీతి కేంద్రాలుగా..

    రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్ (FMC)​ కోసం కూడా కొంతమంది అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం చాలా కార్యాలయాల్లో రూ.వేయి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెదక్​ జిల్లాలోని ఓ తహశీల్దార్​ కార్యాలయంలో సైతం రూ. వెయ్యి ఇస్తేనే దరఖాస్తును ఆమోదిస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్​ల కోసం వచ్చే వారి దగ్గర సైతం అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు. ఆపరేటర్లు, అటెండర్ల సాయంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. లంచం ఇవ్వకపోతే రేపు మాపు అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

    ACB Trap | లంచం ఇవ్వొద్దు

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    READ ALSO  ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఈ

    Latest articles

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణమండపంలో (Shivaji Nagar Munnurkapu...

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు...

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​...

    More like this

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణమండపంలో (Shivaji Nagar Munnurkapu...

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు...