ePaper
More
    Homeక్రీడలుLionel Messi | ఇండియాకి రాబోతున్న ఫుట్‌బాల్ దిగ్గ‌జం... కోహ్లీ,రోహిత్‌, స‌చిన్‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌నున్న...

    Lionel Messi | ఇండియాకి రాబోతున్న ఫుట్‌బాల్ దిగ్గ‌జం… కోహ్లీ,రోహిత్‌, స‌చిన్‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌నున్న మెస్సీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lionel Messi | ప్రపంచ ఫుట్‌బాల్ హిస్టరీలో అద్భుత క్రీడాకారుడిగా పేరు గడించిన లియోనెల్ మెస్సీ ఈసారి ఫుట్‌బాల్ కాదు.. క్రికెట్ బరిలోకి దిగబోతున్నారు. డిసెంబర్ 14న ముంబయి వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో మెస్సీ క్రికెట్ బ్యాట్ పట్టనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే క్రీడాభిమానులకు ఓ అద్భుత దృశ్యంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలతో పాటు మరికొందరు మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 14న వాంఖడే స్టేడియాన్ని ఒక ప్రముఖ ఈవెంట్ సంస్థ బుక్ చేసేందుకు ఇప్పటికే ముంబయి క్రికెట్ అసోసియేషన్‌(Mumbai Cricket Association)ను సంప్రదించిందని సమాచారం.

    READ ALSO  WCL 2025 | నిరాశ‌ప‌రిచిన సీనియ‌ర్ ఆట‌గాళ్లు.. సిరీస్ నుండి ఔట్

    మెస్సీ(Lionel Messi) డిసెంబర్ 13 నుంచి 15 వరకు భారత పర్యటనలో ఉండనున్నట్టు సమాచారం. ముంబయితో పాటు ఢిల్లీ, కోల్‌కతా నగరాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. గతంలో, 2011లో కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం(Kolkata Salt Lake Stadium)లో వెనిజులాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన మెస్సీకి.. భారత్‌ విజిట్ రెండో సారి కావడం విశేషం. ప్రస్తుతం 38 ఏళ్ల మెస్సీ, అమెరికాలో మేజర్ లీగ్ సాకర్‌లో ఇంటర్ మయామీ తరఫున ఆడుతున్నారు. వచ్చే ఏడాది ఫీఫా వరల్డ్ కప్‌(FIFA World Cup) తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా మెస్సీ మరో మల్టీ-టాలెంటెడ్ అవతారం ప్రదర్శించబోతున్నాడు.

    ఈ క్రికెట్ ఈవెంట్‌పై అధికారిక షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. అయితే మెస్సీ వాంఖడే  మైదానంలో బ్యాట్‌తో కనిపిస్తే, అది కేవలం క్రీడా రంగానికే కాకుండా అంతర్జాతీయ స్పోర్ట్స్(International Sports) వేదికపై ఓ చారిత్రక క్షణంగా నిలవనుంది. దీని కోసం అటు క్రికెట్ ప్రేమికుల‌తో పాటు ఫుట్ బాల్ ప్రేమికులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల కాగా, దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

    READ ALSO  ENGvIND | స్టోక్స్ సెంచ‌రీ.. 311 ప‌రుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్

    Latest articles

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి...

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    More like this

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి...

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...