ePaper
More
    HomeజాతీయంKarnataka | జీతం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు.. రిటైర్డ్​ గుమాస్తా ఆస్తులు చూసి...

    Karnataka | జీతం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు.. రిటైర్డ్​ గుమాస్తా ఆస్తులు చూసి షాకైన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | వ్యవస్థలో అవినీతి భాగం అయిపోయింది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అటెండర్​ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

    తాజాగా ఓ రిటైర్డ్​ గుమాస్తా (Retired Clerk) ఆస్తులు చూసి అధికారులు షాక్​ అయ్యారు. నెలకు రూ.15 వేల జీతంలో పనిచేసిన ఆ ఉద్యోగి ఆస్తులు ఏకంగా రూ.30 కోట్లు ఉండడం గమనార్హం. కర్నాటకలోని (Karnataka) కొప్పల్‌ జిల్లా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి గుమస్తాగా పని చేశాడు. ఆయన ప్రస్తుతం రిటైర్డ్​ అయ్యారు. అయితే లోకాయుక్త అధికారులు తాజాగా ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా కీలక విషయాలు వెలుగు చూశాయి. రూ.15 వేల జీతంతో పని చేసిన గుమాస్తా రూ.30 కోట్ల ఆక్రమాస్తులు కూడ బెట్టినట్లు అధికారులు గుర్తించారు. మాజీ ఇంజినీర్​ చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాజెక్ట్​లకు ఫేక్​ బిల్లులు, పత్రాలు సృష్టించి రూ.72 కోట్లు కాజేశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

    Karnataka | 24 ఇళ్లు.. 40 ఎకరాల భూమి

    మాజీ గుమాస్తా నిడగుండికి 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి ఉన్నట్లు లోకాయుక్తా అధికారులు (Lokayukta Officers) గుర్తించారు. అంతేగాకుండా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పలు ఆస్తులు ఉన్నాయి. ఆయన ఇంట్లో 1.5 కిలోల వెండి, 350 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

    దేశవ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్​ అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం (Government job) వస్తే తమను ఎవరు ఏమి చేయలేరనే భావనతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక గుమస్తా ఏకంగా రూ.30 కోట్ల ఆస్తులు (Rs. 30 Crores Property) కూడబెట్టాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్​గా మారింది. గుమాస్తానే రూ.30 కోట్లు సంపాదిస్తే సదరు ఇంజినీర్​ ఎంత సంపాదించాడనేది విచారణలో తేలనుంది.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...