CM Revanth
CM Revanth Reddy | హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి సీఎం రేవంత్​రెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు(Kasam Venkateswarlu) హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

తాజాగా దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్​ను కొట్టి వేసింది. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్​రెడ్డి అన్నారని పిటిషనర్​ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హైకోర్టులో (High Court) క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కాసం వెంకటేశ్వర్లు పిటిషన్​ను కొట్టివేసింది.