Banswada
Banswada | బాలుడి మృతి.. ప్రైవేట్​ ఆస్పత్రి ఎదుట కుటుంబీకుల ఆందోళన

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద (Bichkunda) మండల శాంతాపూర్ (Shanthapur)​ గ్రామానికి చెందిన భానుప్రసాద్​కు (16) మంగళవారం రాత్రి జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో పరిస్థితి విషమించినప్పటికీ పట్టించుకోలేదని.. ఉదయం నిజామాబాద్​ ఆస్పత్రికి (Nizamabad GGH) తీసుకెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు.

దీంతో బాలుడిని వెంటనే నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడకు తీసుకెళ్లి ప్రైవేట్​ ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సీఐ అశోక్​ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు.