- Advertisement -
HomeతెలంగాణKaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్‌ గడువు పొడిగింపు.. మూడు రోజుల్లో ప్రభుత్వానికి చేరనున్న నివేదిక

Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్‌ గడువు పొడిగింపు.. మూడు రోజుల్లో ప్రభుత్వానికి చేరనున్న నివేదిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్​ గడువును మరో మూడు రోజులు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwaram Project)లో అక్రమాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం జస్టిస్​ పీసీ ఘోష్(Justice PC Ghosh) నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్​ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ గడువు మే 31తోనే ముగిసింది.

Kaleshwaram Commission | వారి విచారణ కోసం..

కాళేశ్వరం కమిషన్​(Kaleshwaram Commission) దాదాపు 200 మంది అధికారులను విచారించింది. కీలకంగా వ్యహరించిన ఇంజినీరింగ్​ అధికారులను పలుమార్లు విచారించింది. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తాము నడుచుకున్నామని అధికారులు తెలిపారు. దీంతో అప్పటి మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రులు హరీశ్​రావు(Harish Rao), ఈటల రాజేందర్ ​ను విచారించాలని కమిషన్​ నిర్ణయించింది. దీంతో మే 31తో ముగియాల్సిన కమిషన్​ గడువును ప్రభుత్వం రెండు నెలల పాటు పొడిగించింది.

- Advertisement -

Kaleshwaram Commission | నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల

కమిషన్​ జూన్​లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajender)​, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్​రావును విచారించింది. అన్ని నిర్ణయాలు కేబినెట్​లో చర్చించి తీసుకున్నట్లు వారు తెలిపారు. వీరిని బీఆర్​కే భవన్(BRK Bhavan)​లో కమిషన్​ బహిరంగంగా విచారించింది. అనంతరం మాజీ సీఎం కేసీఆర్​ సైతం విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో బహిరంగా విచారణ కాకుండా ఫేస్​ టు ఫేస్​ విచారణకు హాజరయ్యారు.

కమిషన్​ ముఖ్యంగా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ(Medigadda)కు ప్రాజెక్ట్​ను ఎందుకు మార్చారు, డిజైన్​ మార్పు వెనక కారణం ఏమిటి, నిధులు ఎలా విడుదల చేశారనే వివరాలు సేకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు కమిషన్​ గుర్తించింది.

Kaleshwaram Commission | 400 పేజీలతో నివేదిక

కాళేశ్వరం కమిషన్​ 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ రోజుతో కమిషన్​ గడువు ముగియనుంది. అయితే నివేదికను ఫైనల్​ చేసి ప్రభుత్వానికి అందించనుంది. దీనికోసం మరో మూడు రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో ఐఏఎస్​ అధికారులు, ఇంజినీర్ల మధ్య సమన్వయలోపం ఉందని కమిషన్​ పేర్కొంది. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రస్తావించింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్​ గుర్తించింది.

Kaleshwaram Commission | అసెంబ్లీలో ప్రవేశ పెట్టే యోచన

కాళేశ్వరం కమిషన్​ తన తుది నివేదికను మూడు రోజుల్లో సమర్పించనుంది. అనంతరం దీనిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్​ కుటుంబం కమీషన్ల కోసమే దీనిని నిర్మించారని కాంగ్రెస్​, బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్​ఎస్​ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరంలో అక్రమాలపై చర్చ జరిగితే కాంగ్రెస్​కు లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News