More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | ఉద్యోగులకు బదిలీలు సహజం

    Bheemgal | ఉద్యోగులకు బదిలీలు సహజం

    Published on

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఐకేపీ భీమ్‌గల్ ఏపీఎం రవీందర్​కు మండల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని విధి నిర్వహణలో ఏపీఎం పప్పుల రవీందర్ సేవలు అమూల్యమైనవన్నారు.

    ఐకేపీ సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి మాట్లాడుతూ భీమ్​గల్ ఏపీఎంగా పనిచేసిన 16 నెలల కాలంలోనే రవీందర్ స్థానిక మహిళల ఆదరణ పొందారని, విలువైన సేవలు మహిళా సంఘాలకు అందించారని పేర్కొన్నారు.

    అనంతరం కార్యాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, వీవోఏలు బదిలీపై వెళ్తున్న ఏపీఎం రవీందర్​ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో నర్సయ్య, సీసీలు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, రఘుపతి, భాస్కర్, గంగాసాయిలు, గంగాధర్, లలిత, సుమలత, సురేష్, గణేశ్​, ముత్యం, అన్ని గ్రామ సంఘాల వీవోఏలు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    More like this

    Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Urea Shortage | యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy)...

    Armoor | పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ జాన్

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ (Armoor Mandal Pastors Association) నూతన కార్యవర్గ...

    Karnataka CM | అగ్గి రాజేసిన కర్ణాటక సీఎం.. మత మార్పిళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Karnataka CM | వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)...