అక్షరటుడే, నిజాంసాగర్: Navodaya Vidyalaya | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad) (Kamareddy) జవహర్ నవోదయ విద్యాలయంలో (Jawahar Navodaya Vidyalaya) ప్రవేశాలకు విధించిన గడువును పొడిగించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఈనెల 29వరకు గతంలో గడువు విధించారు.
Navodaya Vidyalaya | ఆగస్టు 13వ తేదీ వరకు..
ప్రవేశాల గడువును ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా సీబీఎస్ఈ ప్రకటించింది. దీంతో అర్హత గల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మను యోహనన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.