AP Liquor Scam
AP Liquor Scam | లిక్కర్​ స్కామ్​లో కొనసాగుతున్న అరెస్టులు.. భారీగా నగదు స్వాధీనం

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP Liquor Scam | ఏపీ లిక్కర్​ స్కామ్​(AP Liquor Scam)లో అరెస్ట్​ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్​ విచారణకు ప్రభుత్వం ఇప్పటికే సిట్​ను ఏర్పాటు చేసింది. విచారణ ప్రారంభించిన అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్​ చేశారు. ఇందులో కీలక నిందిడుతు రాజ్​ కసిరెడ్డి(Raj Kasireddy)ని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు. తాజాగా మరో నిందితుడు వరుణ్​(Varun)ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

AP Liquor Scam | ఎయిర్​పోర్ట్​లో అరెస్ట్​..

లిక్కర్​ కేసులో ఏ 40గా ఉన్న వరుణ్​ను సిట్​ అధికారులు(SIT Officers) అరెస్ట్​ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు తప్పించుకొని పారిపోవడానికి ఆయన యత్నించగా.. ఎయిర్​పోర్టు(Shamshabad Airport)లో అరెస్ట్​ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్​ అయిన వారి సంఖ్య 13కు చేరింది. వరుణ్​ను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

AP Liquor Scam | అట్టపెట్టెల్లో రూ.11 కోట్లు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో అక్రమంగా దాచి ఉంచిన నగదును అధికారులు సీజ్​ చేశారు. ఓ ఫామ్​హౌస్​లో 12 అట్టపెట్టెల్లో దాచి ఉంచి రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్​ కేసు(Liquor Case)లో నిందితుడు వరుణ్ వాంగ్మూలం ఆధారంగా సిట్​ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని ఓ ఫామ్​హౌస్(Kachharam Farm House)​లో దాచిన నగదును అధికారులు సీజ్​ చేశారు. నగదు బయట పడటంతో వరుణ్​ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విదేశాలకు పారిపోవడానికి యత్నించగా.. శంషాబాద్​ ఎయిర్​పోర్టులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

AP Liquor Scam | విజయవాడకు తరలింపు

లిక్కర్​ స్కామ్​లో ఏ40గా ఉన్న వరుణ్​ను అరెస్ట్​ చేసిన సిట్​ అధికారులకు విజయవాడ(Vijayawada)కు తీసుకెళ్లారు. ఈ రోజు ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాజ్​కసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు రూ.11 కోట్ల నగదును వరుణ్​ దాచిపెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.