అక్షరటుడే, వెబ్డెస్క్: ED Raids | గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. బీఆర్ఎస్ (BRS) హయాంలో గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. యూనిట్ ధరలో 25 శాతం లబ్ధిదారులు భరిస్తే 75 శాతం ప్రభుత్వం చెల్లించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,93,223 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. రెండో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ కొంత మందికి మాత్రమే గొర్రెలు అందించారు. అయితే గొర్రెల పంపిణీలో (Sheep Distribution) భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి.
ED Raids | ఏసీబీ కేసు నమోదు
గొర్రెల పంపిణీ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండానే డబ్బులు అందించారు. అంతేగాకుండా అవే గొర్రెలను పలువురు లబ్ధిదారులకు అందించినట్లు చూపించి భారీ మొత్తంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పథకంలో సుమారు రూ.750 కోట్లు కుంభకోణం జరిగినట్లు గతంలో ఏసీబీ కేసు నమోదు (ACB Registers Case) చేసింది. పలువురు నిందితులను కూడా అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ పరారీలో ఉన్నారు.
ED Raids | 8 చోట్ల సోదాలు
ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు (Enforcement Case) ఇన్ఫరేషన్ రిపోర్టు తయారు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నారు. లోలోనా పేరుతో ప్రభుత్వ స్కీమన్ను మొయినుద్దీన్ స్కామ్గా (Moinuddin Scam) మార్చాడు. మొయినుద్దీన్కు చెందిన లోలోనా కార్యాలయాల్లో ఈడీ సోదాలు(ED Raids) చేపడుతోంది. మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ నివాసాల్లో సైతం అధికారులు దాడులు చేశారు. ఈ స్కామ్లో ఇప్పటికే పలువురు పశు సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్రనాయక్(Former Director Ramachandra Nayak) ఇంట్లో తాజాగా ఈడీ సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్(Former Minister OSD Kalyan) నివాసాల్లో సోదాలు సైతం తనిఖీలు చేపట్టింది.