ePaper
More
    HomeతెలంగాణHyderabad | గజం రూ.2 ల‌క్ష‌ల‌కు పైగానే.. హైద‌రాబాద్‌లో భూముల వేలానికి సిద్ధం

    Hyderabad | గజం రూ.2 ల‌క్ష‌ల‌కు పైగానే.. హైద‌రాబాద్‌లో భూముల వేలానికి సిద్ధం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ఆదాయం కోసం ప్ర‌భుత్వం భూముల అమ్మ‌కానికి మ‌రోసారి సిద్ధ‌మైంది. హైద‌రాబాద్‌లోని ప‌లు స్థ‌లాల‌ను అమ్మ‌కానికి పెట్టింది. ప్రైమ్ లోకేష‌న్ల‌లో (prime locations) ఉన్న భూముల‌కు ఈ సారి రికార్డు ధ‌ర ప‌లుకుతుంద‌ని భావిస్తోంది. హైద‌రాబాద్‌లోని మొత్తం 66 ఎక‌రాల‌ను ఈసారి అమ్మ‌కానికి పెట్టింది. తెలంగాణ ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ (Telangana Industrial Infrastructure Corporation) (టీజీఐఐసీ) ద్వారా వీటిని విక్ర‌యించనుంది. రాయ‌దుర్గంలోని స్థ‌లాల‌కు నిర్ణ‌యించిన ధ‌ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌జానికి రూ.2 ల‌క్ష‌ల‌కు పైగా టీజీఐఐసీ నిర్ణ‌యించ‌గా, అంత‌కు మించి ధ‌ర వ‌స్తుంద‌న్న అంచ‌నాలు నెల‌కొన్నాయి.

    Hyderabad | ప్రైమ్ లొకేష‌న్ల‌లో..

    భూముల అమ్మ‌కం ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవాల‌ని భావిస్తున్న ప్ర‌భుత్వం కీల‌క ప్రాంతాల్లోని స్థ‌లాల‌ను విక్ర‌యానికి పెట్టింది. రాయ‌దుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్‌సాగ‌ర్‌లో 13 ప్లాట్ల‌ను వేలం వేయాల‌ని నిర్ణ‌యించింది. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్స్‌లోని 66 ఎక‌రాల‌కు టెండ‌ర్లు ఆహ్వానించింది. ఆగ‌స్టు 8న టెండ‌ర్ల దాఖ‌లుకు గడువు ముగియ‌నుంది. అదే రోజు టీజీఐఐసీ బోర్డు (TGIIC board) టెక్నిక‌ల్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఆగ‌స్టు 12న టెండ‌ర్లు ఖ‌రారు చేయ‌నున్నారు.

    READ ALSO  GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    Hyderabad | గ‌జానికి రూ.2 ల‌క్ష‌లపైనే..

    ఈ వేలంలో రాయ‌దుర్గంలో (Rayadurgam) వేలానికి ఉంచిన భూముల‌కు భారీగా ధ‌ర ల‌భిస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి. టీజీఐఐసీ నిర్ణ‌యించిన ధ‌ర‌లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. రాయ‌దుర్గంలోని 7 ఎక‌రాలు క‌ల‌ 15A/2 ప్లాట్‌కు అత్య‌ధికంగా రూ.71.60 కోట్లుగా మార్కెట్ ధ‌ర‌ను పేర్కొన్న టీజీఐఐసీ.. క‌నీస ధ‌ర‌గా రూ.50.10 కోట్లుగా నిర్దారించింది. ఇక‌, అదే ప్రాంతంలోని ప్లాంట్ 19 ధ‌ర రూ.66.30 కోట్లు ఉండగా, అప్ సైట్ ప్రైస్‌ను రూ.44.30 కోట్లుగా పేర్కొంది. ఈ పార్సిల్‌లో 11 ఎక‌రాల‌ను విక్ర‌యించ‌నున్నారు. రాయ‌దుర్గంలోని 14B/1, 14A/1 ప్లాట్ల మార్కెట్ ధ‌ర‌ను (market price) చ‌ద‌ర‌పు గ‌జానికి రూ.2.16 ల‌క్ష‌లుగా ప్ర‌క‌టించారు. ఈ లెక్క‌న ఎక‌రానికి రూ.204.74 కోట్ల ధ‌ర‌గా నిర్ణ‌యించారు. ఈ రెండు ప్లాట్ల అప్‌సెట్ ధ‌ర‌ను చ‌ద‌ర‌పు గ‌జానికి రూ.1.51 ల‌క్ష‌లుగా పేర్కొన్నారు. ఉస్మాన్ సాగ‌ర్ వ‌ద్ద 13 ప్లాట్ల‌కు ప్లాట్‌ను బ‌ట్టి రూ.18.70 కోట్ల నుంచి రూ.25 కోట్లుగా నిర్ణ‌యించారు.

    READ ALSO  Weather Updates | నేడు వర్ష సూచన

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...