అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka : కుటుంబ గౌరవాన్ని మంటగలిపాడని ఓ యువకుడిన(23)ని అతడి సోదరి, బావ కలిసి హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటన కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా Chitradurga district లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
హతుడికి HIV పాజిటివ్ (HIV positive) అని తేలడంతో.. ఎక్కడ కుటుంబం పరువు పోతుందోనని భయపడి, సొంత అక్కే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
చిత్రదుర్గ జిల్లా హోళల్కెరె తాలూకా(Holalkere taluka) దుమ్మీ గ్రామానికి(Dummi village) యువకుడు(23 ) ఈ నెల(జులై) 25న హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా బాధితుడి అక్కయ్య నిషాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త మంజునాథ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Karnataka : అసలేం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువకుడు దుమ్మీ గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు. తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో జులై 23న కారులో గ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో రోడ్డుపై ఆగిఉన్న ట్రక్కును ఢీకొన్నాడు. దీంతో బాధిత యువకుడు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం దావణగెరెలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్లో శస్త్రచికిత్సకు ముందు రక్త పరీక్షలు నిర్వహించగా.. సదరు యువకుడికి ఎయిడ్స్(HIV పాజిటివ్) సోకినట్లు తేలింది. దీంతో వైద్యులు అతడిని వేరే హాస్పిటల్కు తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో జులై 25న నిషాతోపాటు ఆమె భర్త కలిసి మల్లికార్జున్ను తీసుకొని బెంగళూరు బయలుదేరారు. కానీ, కొన్ని గంటల్లోనే తిరిగి వచ్చేశారు. అప్పటికే ఆ యువకుడు చనిపోయి ఉన్నాడు. మార్గమధ్యలో చనిపోయాడని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చి అతడి తండ్రి నాగరాజప్ప నిలదీయగా.. తమ్ముడు హెచ్ఐవీ సోకిందని బాధ వ్యక్తం చేసినట్లు నిషా తెలిపింది. దీనికితోడు అప్పులతో సతమతమవుతున్నట్లు తెలిపినట్లు పేర్కొంది. తాను చనిపోవాలనే కోరికను తమ్ముడు వెల్లడించినట్లు చెప్పుకొచ్చింది. అతడి కోరిక మేరకు గొంతునొక్కి చంపేసినట్లు అక్కా, బావ వివరించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో మల్లికార్జున్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.